Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఇన్‌చార్జ్ గవర్నరుగా సీపీ రాధాకృష్ణన్

ఠాగూర్
మంగళవారం, 19 మార్చి 2024 (12:00 IST)
తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరుగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ బాధ్యతలను జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు అదనంగా కేటాయించారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. 
 
మరోవైపు, గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత తమిళిసై హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ను వీడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను ప్రజాసేవ కోసం తిరిగి వెళుతున్నానని చెప్పారు. తనపై చూపిన ప్రేమాభిమానాలకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నట్టు చెప్పారు. పైగా తాను ఎప్పటికీ తెలంగాణ సోదరినేనని, తెలంగాణాను వీడి వెళుతున్నందుకు బాధగా ఉందని చెప్పారు. 
 
మరోవైపు, లోక్ సభ ఎన్నికలలో ఆమె బీజేపీ తరపున తమిళనాడులో బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది. గవర్నర్ పదవి చేపట్టకముందు ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. 2019 సెప్టెంబర్ నుంచి తెలంగాణ గవర్నర్‌గా ఉన్నారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమె ఇపుడు ఈ రెండింటికి రాజీనామా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments