Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రికి బైక్ గిఫ్టుగా ఇచ్చేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన టెక్కీ

ఠాగూర్
ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (15:09 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ సాఫ్ట్‌వేర్ మహిళా ఉద్యోగిని ప్రాణాలు కోల్పోయారు. తన తండ్రికి బైకు గిఫ్టుగా ఇచ్చేందుకు స్వగ్రామానికి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడింది. రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలం, ఆకుపాముల వద్ద ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, గచ్చిబౌలిలలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో యశస్విని అనే యువతి టెక్కీగా పనిచేస్తున్నారు. వెస్ట్ గోదావరి జిల్లా తుందుర్రు అనే గ్రామంలో ఉండే తన తండ్రికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకును గిఫ్టుగా ఇచ్చి సర్‌ ప్రైజ్ చేయాలని భావించింది. ఇందులో హైదరాబాద్ నగరంలోని ఆ బైకును కొనుగోలు చేసింది. తనతో పాటు పని చేస్తున్న ఉద్యోగితో కలిసి స్వగ్రామానికి బైకుపై బయలుదేరింది. 
 
అయితే, వీరి బైకు సూర్యాపేట జిల్లా మునగాల మండలం, ఆకుపాముల వద్ద వెళుతుండగా బైకు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో యశస్విని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లా తుందుర్రు గ్రామవాసిగా గుర్తించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments