భర్తపై కోపంతో 2 నెలల పసికందును ట్రాక్టర్ టైర్ కింద పడేసిన తల్లి (video)

ఐవీఆర్
సోమవారం, 10 నవంబరు 2025 (15:16 IST)
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
తెలంగాణ లోని మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం ముప్పిరెడ్డి పల్లెలో కన్నతల్లి దారుణానికి పాల్పడింది. భర్త మీద కోపంతో 2 నెలల పసికందును ట్రాక్టర్ టైర్ కిందకి విసిరేసింది. డబ్బు విషయమై భర్తతో తీవ్ర వాగ్వాదానికి దిగిన సంధ్య అనే మహిళ, కోపంలో బిడ్డను ట్రాక్టర్ చక్రాల కిందకు విసిరేసింది. ఐతే స్థానికులు సమయానికి ఆ బిడ్డను రక్షించారు.
 
తమిళనాడులో విషాదకర సంఘటన జరిగింది. 5 నెలలు వయసున్న ఓ బాబు తల్లి పాలు తాగుతూ మృతి చెందాడు. తొలుత ఈ మరణం సహజ మరణం అనుకున్నారు. కానీ సదరు మహిళ భర్త తన భార్యపై చేసిన ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేసారు. తన భార్య కొడుక్కి విషపు పాలు ఇచ్చి చంపేసిందంటూ అతడు చేసిన ఆరోపణలతో అక్కడివారంతా షాకయ్యారు.
 
భర్త ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం... కృష్ణగిరి జిల్లాలోని చిన్నతి గ్రామంలో సురేష్, భారతి దంపతులు నివాసం వుంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. వారిలో ఐదు నెలల చిన్న బాబు కూడా వున్నాడు. ఐతే సురేష్ భార్య భారతి ప్రవర్తన ఇటీవలి కాలంలో చాలా తేడాగా వుండటాన్ని గమనించాడు. గంటలకొద్దీ భారతి తన స్నేహితురాలు సుమిత్రతో గడుపుతోంది. వగతెగని ఫోన్ సంభాషణ చేస్తోంది. ఇది కాస్తా వారిమధ్య అసహజ సంబంధానికి దారి తీసింది. వారు ఏకాంతంగా కలుసుకునేందుకు ఆ చిన్నారి అడ్డుగా వున్నాడని బాబుకి విషంతో కలిపిన పాలు ఇచ్చి చంపేసిందంటూ భర్త ఆరోపణలు చేసాడు.
 
అంతేకాకుండా ఈమధ్య తన భార్య భారతి ఫోనులో సుమిత్రతో కలిసి అసభ్యకరంగా దిగిన ఫోటోలు, వారి సంభాషణలు కూడా బయటపడ్డాయి. వీటిని చూసిన భర్త షాక్ తిన్నాడు. తన భార్యే తన బాబును చంపేసిందంటూ ఆరోపిస్తున్నాడు. మృతి చెందిన బాబును పోలీసులు డిటైల్డ్ మెడికల్ రిపోర్ట్ కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సురేష్ భార్య భారతిని, ఆమె స్నేహితురాలు సుమిత్రను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాందినీ గాయంతో కాలు నొప్పి ఉన్నా డాకూ మహారాజ్ లో పరుగెత్తే సీన్స్ చేసింది : బాబీ

Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

జూటోపియా 2 లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments