Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్లు రెండు గుటకలు వేయగానే నోటికాడికి వచ్చిన కట్లపాము...

ఠాగూర్
శుక్రవారం, 17 జనవరి 2025 (10:22 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కల్లు తాగేందుకు వెళ్లగా అతనికి తేరుకోలేని షాకి తగిలింది. శారీరక ఉపశమనం కోసం కల్లు తాగేందుకు కల్లు దుకాణానికి వెళ్లి కల్లీ సీసాను కూలీ కొనుగోలు చేయగా, అందులో ఉన్న కట్లపామును చూసి షాక్‌కు గురయ్యాడు. గురువారం రాత్రి వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
నాగర్ కర్నూలు జిల్లాలోని లట్టుపల్లి గ్రామంలో గురువారం రాత్రి ఓ వ్యక్తి కల్లు దుకారణంలో కల్లు సీసా కొని, రెండు గుటకలు వేయడంతో అందులోని కట్లపాము నోటికికాడికి వచ్చింది. దానిని ఉమ్మివేయడంతో అందులో నుంచి సుమారు ఆరు ఇంచుల కట్లపాము బయటపడింది. 
 
ఇదంతా అక్కడే ఉన్న గ్రామస్తులంతా చూసి ఒక్కసారిగా ఖంగుతున్నారు. ఇదేంటని కల్లీకల్లు తయారు చేసే యజమానిని ప్రశ్నించగా బిత్తిరి చూపులు చూశాడు. దీంతో కోపంతో రగిలిపోతూ గ్రామస్తులంతా కలిసి ఆ కల్లు దుకాణాన్ని, సీసాలను ధ్వంసం చేశారు. డబ్బులకు ఆశపడి కల్తీ కల్లు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ కల్లు యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులంతా కలిసి ఆందోళనకు దిగారు. ఈ విషయం అబార్కీ శాఖ అధికారులకు చేరడంతో వారు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments