Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌‌లో కేరళ భవన్... స్థలం, నిధులు కేటాయించిన కేసీఆర్..!

Webdunia
సోమవారం, 2 ఫిబ్రవరి 2015 (11:12 IST)
తెలంగాణలో కేరళీయుల సంక్షేమం కోసం ముఖ్య మంత్రి కేసీఆర్ నడుంకట్టారు. హైదరాబాద్‌లో మలయాళీ అసోసియేషన్ భవనం (కేరళ భవన్)ను నిర్మించేందుకు మహేంద్ర హిల్స్‌లో ఎకరం భూమి కేటాయించి, దాని నిర్మాణానికి కోటి రూపాయల నిధులను కేసీఆర్ ప్రకటించారు. అదేవిధంగా నగరంలో నివసిస్తున్న నిరుపేద మలయాళీయుల కుటుంబాలకు పక్కా ఇళ్లు కట్టిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.
 
కేరళ ప్రభుత్వ సహకారంతో నగరంలోని మలయాళీ అసోసియేషన్(సీటీఆర్‌ఎంఏ) ఆధ్వర్యంలో ఆదివారం బాలానగర్‌లోని నవీన సాంస్కృతిక కళా కేంద్రంలో కేరళీయం-2015 పేరుతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో సుమారు నాలుగు లక్షల మందికి పైగా మలయాళీలు ఉన్నారని తెలిపారు. వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ  కార్యక్రమంలో కేరళ మంత్రి కె.సి.జోసఫ్, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బాల్క సుమన్‌లతో పాటు పలువురు మలయాళీయులు కూడా పాల్గొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments