Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌‌లో కేరళ భవన్... స్థలం, నిధులు కేటాయించిన కేసీఆర్..!

Webdunia
సోమవారం, 2 ఫిబ్రవరి 2015 (11:12 IST)
తెలంగాణలో కేరళీయుల సంక్షేమం కోసం ముఖ్య మంత్రి కేసీఆర్ నడుంకట్టారు. హైదరాబాద్‌లో మలయాళీ అసోసియేషన్ భవనం (కేరళ భవన్)ను నిర్మించేందుకు మహేంద్ర హిల్స్‌లో ఎకరం భూమి కేటాయించి, దాని నిర్మాణానికి కోటి రూపాయల నిధులను కేసీఆర్ ప్రకటించారు. అదేవిధంగా నగరంలో నివసిస్తున్న నిరుపేద మలయాళీయుల కుటుంబాలకు పక్కా ఇళ్లు కట్టిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.
 
కేరళ ప్రభుత్వ సహకారంతో నగరంలోని మలయాళీ అసోసియేషన్(సీటీఆర్‌ఎంఏ) ఆధ్వర్యంలో ఆదివారం బాలానగర్‌లోని నవీన సాంస్కృతిక కళా కేంద్రంలో కేరళీయం-2015 పేరుతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో సుమారు నాలుగు లక్షల మందికి పైగా మలయాళీలు ఉన్నారని తెలిపారు. వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ  కార్యక్రమంలో కేరళ మంత్రి కె.సి.జోసఫ్, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బాల్క సుమన్‌లతో పాటు పలువురు మలయాళీయులు కూడా పాల్గొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

Show comments