Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్వాసనకు తర్వాత కేసీఆర్‌తో రాజయ్య భేటీ!

Webdunia
మంగళవారం, 3 ఫిబ్రవరి 2015 (08:51 IST)
తెలంగాణ మంత్రివర్గం నుంచి అవమానకరరీతిలో ఉద్వాసనకు గురైన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి తాటికొండ రాజయ్య సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత రాజయ్య తొలిసారి సీఎంతో సమావేశం కావడం గమనార్హం. కేసీఆర్‌ను క్యాంప్ ఆఫీసులో కలిశారు.
 
వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాజయ్యను మంత్రివర్గం నుండి తప్పించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి చోటు దక్కింది. ఆ తర్వాత రాజయ్య ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించినా అపాయింటుమెంట్ లభించలేదు. ఇప్పుడు ఆయన కలిశారు. అయితే, ఈ భేటీ వెనుక ఏదో మతలబు ఉన్నట్టు తెలుస్తోంది. 
 
తనకు ముఖ్యమంత్రి నుంచి పిలుపు వస్తే కలుస్తానని రాజయ్య కొద్ది రోజుల క్రితం చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనే కలిశారా లేక కేసీఆర్ పిలిచారా అనే చర్చ సాగుతోంది. అయితే, రాజయ్యనే కలిసి ఉంటారంటున్నారు. కాగా, కేసీఆర్‌ను కలిసిన అనంతరం రాజయ్య మాట్లాడుతూ.. తాను కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments