Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాపై ఈసీ డేగకన్ను... గ్రూపు సందేశాలపై నిషేధం

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (10:25 IST)
తెలంగాణ రాష్ట్రల ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరుగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగియడంతో ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు సోషల్ మీడియాపై దృష్టిసారించారు. ప్రధాన పార్టీల మద్దతుదారులు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలలో అభ్యంతరకర చిత్రాలు పంపుతూ భావోద్వేగాలను రెచ్చగొట్టే దృశ్యాలపై పోలీస్ ఉన్నతాధికారులు నిఘా పెట్టారు. 
 
నిజానికి ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదు. కానీ సోషల్ మీడియా ప్రచారంపై ఎలాంటి ఆంక్షలు లేవు. దీంతో అభ్యర్థులు సోషల్ మీడియా ద్వారా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన పార్టీలతో సహా వారి మద్దతుదారులు కూడా అందరూ పోలింగ్ ముగిసే వరకు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లపై ఆధాపడ్డారు. 
 
సామాజిక మాధ్యమాల్లో నాయకులను, పార్టీలను కించపరుస్తూ అభ్యంతరకర దృశ్యాలను వీడియోలు, లేదా ఫోటోలు పెడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి దృశ్యాలపై నాయకులు, ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు ఇస్తే ఐటీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నామని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో సోషల్ మీడియాల్లో వచ్చే అభ్యంతరకత పోస్టులను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments