తయారు చేయండి ఇలా: మొదట పొయ్యి మీద పాన్ పెట్టుకుని పచ్చిపాలు పోసి, పంచదార కలిపి, అందులో మైదా పిండి, వరి పిండి, మొక్కజొన్న పిండిని వేసి బాగా కలుపుకోవాలి. అలాగే సన్నని సెగ మీద ఈ మిశ్రమాన్ని గరిటెతో కలుపుతూ ఉండాలి. మరో వైపు జీడిపప్పులను కొంచెం నీళ్లు చేర్చి మిక్సీలో గ్రైండ్ చేసుకుని ముద్దంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్పై ఉన్న మిశ్రం దగ్గరపడుతుండగా జీడిపప్పు ముద్దను చేర్చాలి. యాలకులపొడి కూడా చల్లి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని భాగాలుగా చేసి, మనకు కావల్సిన రంగులు కలిపి. చల్లారాక కొవ్వొత్తుల ఆకారంలో చేసుకోవాలి. వాటిపై పైన అదే మిశ్రమాన్ని వొత్తుల్లా చేసుకుంటే చాలు. నోట్లో వేసుకోగానే కరిగిపోయే కొవ్వొత్తులు సిద్దం. తీయ్యటి ఈ కొవ్వొత్తులు అందరినీ ఆకట్టుకుంటాయి.