పండుగలు వచ్చిందంటే మనకు మొదట గుర్తుకొచ్చేది పాయసం. దీన్నే కొంచెం స్పెషల్గా తయారుచేసుకుందాం! పనీర్, పచ్చికొబ్బరి రెండూ అందరికీ ఇష్టమే. ఈ రెండూ కలిపి చేసే ఈ పాయసం ఎంతో రుచిగా ఉండడం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. దీని తయారీకి కావాల్సిన పదార్థాలను పరిశీలిస్తే...
కావలసిన పదార్థాలు:
పాలు.. లీటరు
పనీర్.. ఒక కప్పు
కొబ్బరితురుము.. అర కప్పు
పంచదార.. ఒక కప్పు
యాలకుల పొడి.. అర స్పూన్
శాఫ్రాన్.. కొద్దిగా
నెయ్యి.. తగినంత
ఎండు ద్రాక్షలు.. కొద్దిగా
జీడిపప్పు, బాదం, పిస్తా.. సరిపడా.
తయారు చేసే విధానం:
ముందుగ స్టౌవ్ వెలిగించి పాత్రలో పాలను పోసి మరిగించాలి. ఇందులో పనీర్ తురుము, కొబ్బరితురుము వేసి ఉడికించాలి. పంచదార కూడా వేసి కలిపి స్టౌవ్ సిమ్లో ఉంచి మిశ్రమం చిక్కగా అయ్యేవరకు ఉడికించి యాలకులపొడి వేయాలి. ఇంకో పాత్రలో ఒక స్పూన్ నెయ్యి వేడిచేసి ఎండు ద్రాక్షలు, జీడిపప్పు, బాదం, పిస్తా వేయించాలి. వీటిని మరిగించిన పాలలో కలపాలి. ఖీర్ బాగా చిక్కగా కావాలంటే కొంచెం కోవా వేసుకోవచ్చు. అంతే పసందైన పన్నీర్ డ్రైఫ్రూట్ పాయసం రెడీ. వేడిగా తాగాలనుకుంటే అలాగే తాగొచ్చు లేదంటే ఫ్రిజ్లో ఉంచి చల్లగా తాగితే ఇంకా బాగుంటుంది.