ముందుగా ఒక బౌల్లో మైదాపిండి వేసుకుని అందులో నెయ్యి, తేనె, పాలు వేసి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పు, బాదం వేగించి తీసేయాలి. అదే బాణలిలో బీట్రూట్, క్యారెట్, కొబ్బరి తురుము ఒకదాని తరువాత ఒకటి వేగించాలి. ఇప్పుడు ఒక పళ్లెంలో వేగించిన తురుములు, యాలకుల పొడి, జీడిపప్పు, బాదం, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. మైదా ముద్దలని ఉండలుగా చేసుకుని పూరీల్లా వత్తుకోవాలి. పూరీల మధ్యలో తగినంత తురుము మిశ్రమాన్ని పెట్టి, కజ్జికాయల్లా వత్తి నూనెలో దోరగా వేగించుకోవాలి. అంతే... బీట్ రూట్ కజ్జికాయలు రెడీ.