Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నుల పండువగా భద్రాద్రి రాముడి పట్టాభిషేకం!

Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2012 (12:25 IST)
FILE
భద్రాచలంలో శ్రీరాముల వారి పట్టాభిషేకం కన్నులపండువగా జరిగింది. దేశంలోని పుణ్య నదీజలాలు ఒక్కచోటికి చేరుకోగా, వేదమంత్రాల సాక్షిగా రాముడు పట్టాభిషిక్తుడైనాడు. ఈ అపురూప దృశ్యాన్ని కనులారా చూసి తరించేందుకు భారీ స్థాయిలో భక్తులు తండోపతండాలుగా భద్రాచలానికి చేరుకున్నారు. భక్తులు చేస్తున్న శ్రీరామ నామ స్మరణతో భద్రాద్రి కొండ మారుమోగిపోతోంది.

అంతకుముందు భద్రాద్రి రాముడికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పట్టువస్త్రాలు సమర్పించుకున్నారు. పట్టాభిషేకం కోసం దేశంలోని గంగా, యమున, సరస్వతి, కృష్ణా, కావేరి, తుంగభద్ర నదుల నుంచి పుణ్య జలాలను భద్రాద్రికి తీసుకువచ్చారు.

ఇదిలా ఉంటే.. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం చలువ పందిళ్లు, వేద పండితుల మంత్రోచ్ఛారమల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

నందన నామ సంవత్సరం చైత్రశుద్ధ మాసం ఆదివారం అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. మరోవైపు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం ఆదివారం ఘనంగా జరిగింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ఉచిత వివాహాలు.. ప్రేమ, రెండో పెళ్లిళ్లు చేయబడవు.. నియమాలు ఏంటి?

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

Show comments