Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ ఆటగాడు గ్రౌండ్‌పై వంగున్నాడంటే ఇండియా గెలిచినట్లేనట..?!!

Webdunia
సోమవారం, 19 మార్చి 2012 (13:29 IST)
PTI
భారీ లక్ష్యం.. 329. అంతటి భారీ స్కోరును అధిగమించి విజయాన్ని కైవసం చేసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ పాకిస్తాన్ ఓపెనర్లలో ఒకరైన నసీర్ జష్మెడ్ సెంచరీ చేసిన అనంతరం వెంటనే వెన్ను వంచి వంగి భూమిని ముద్దాడుతూ ఏదో కాసేపు ప్రార్థనలు చేశాడు. అలా నిమిషం పాటు జరిగింది.

అప్పటివరకూ ఇక ఇండియా పని అయిపోయినట్లే అనుకున్నవారిలో కొందరు మాత్రం భారత్ తప్పక విజయం సాధిస్తుందని బల్లగుద్ది మరీ చెప్పడం మొదలెట్టారు. ఎలా గెలుస్తుందయా బాబూ.. అని నిలదీస్తే.. పాక్ ఆటగాళ్లలో ఎవరైనా ఇలా విజయోత్సాహంతో గ్రౌండులో వంగి భూమిని తాకారంటే ఖచ్చితంగా ఆ పిచ్ వాళ్లను ఓడించి తీరుతుందని సెలవిచ్చారట.

ఎలా చెప్పగలరని అడిగితే... గతంలో యూనిస్ ఖాన్, ఫాస్ట్ బౌలర్ రియాజ్‌లు కూడా ఇలాగే భారత్ పై మంచి స్కోరు చేసినప్పుడు, వికెట్లు తీసినప్పుడు పిచ్‌ను ముద్దాడారనీ, ఆ సమయంలో పాకిస్తాన్ జట్టు పరాజయం పాలైందని కొత్త వాదన తెచ్చారు. అవును.. ఎవరి విశ్వాసం వారిది.. సచిన్ జుట్టు పెంచినందుకే శత శతకం బాదగలిగాడని కొంతమంది అంటున్నారు. అదీ సంగతి.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments