Webdunia - Bharat's app for daily news and videos

Install App

విధ్వంసం సృష్టించిన మాక్స్‌వెల్, మిల్లర్... రాజస్థాన్‌పై పంజాబ్ ఘనవిజయం!

Webdunia
సోమవారం, 21 ఏప్రియల్ 2014 (11:15 IST)
FILE
ఐపీఎల్-7 ఆరంభంలోనే రసవత్తరమైన పోరు జరుగుతోంది. అనూహ్య రీతిలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజాయలు నమోదు చేస్తోంది. తన మొదటి మ్యాచ్‌లో చెన్నైకి షాకిచ్చిన పంజాబ్ తాజాగా రాజస్థాన్‌ను చిత్తుచేసింది. సిక్సర్లు, ఫోర్లతో మాక్సెవల్ స్వరవీహరం చేయడంతో పంజాబ్ భారీలక్ష్యాన్ని ఛేధించి విజయం సాధించింది. మరోవైపు మిల్లర్ కూడూ రెచ్చిపోయి ఆడటంతో ఐపీఎల్‌-7లో రెండో విజయం నమోదు చేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు సాధించింది. సంజు శాంసన్ 52, షేన్ వాట్సన్ 50, స్మిత్ 27 పరుగులు సాధించి రాజస్థాన్‌కు భారీస్కోరునందించారు. అనంతరం బ్యాటింగ్ దిగిన పంజాబ్ 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో చటేశ్వర పుజారాతో మాక్స్‌వెల్ అద్భుత భాగస్వామ్యం నెలకొల్పాడు. ఎటు చూసినా, సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడిన మాక్స్‌వెల్ 126 పరుగుల వద్ద 89పరుగులు చేసి ఔటయ్యాడు.

అప్పటికి విజయానికి 37బంతుల్లో 66 పరుగులు అవసరం. ఈ దశలో క్రీజులోకొచ్చిన మిల్లర్ సిక్సర్ల సునామీ సృష్టించాడు. 51 పరుగులు సాధించి 18.4 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించాడు. పంజాబ్ కేవలం 3 వికెట్లుకోల్పోయి విజయం సాధించింది. పూజారా 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మాక్సెవెల్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments