ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్లో భారత్ (121 పాయింట్లు) మూడో స్థానాన్ని నిలబెట్టుకోగా... తొలి రెండు స్థానాల్లో శ్రీలంక (128), పాకిస్థాన్ (125) ఉన్నాయి. జింబాబ్వేపై రెండు టీ20ల్లోనూ పాకిస్థాన్ గెలవడంతో ఒక రేటింగ్ పాయింటును మెరుగుపర్చుకుంది.
బ్యాట్స్మెన్ జాబితాలో భారత స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి ఐసీసీ టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఆరో స్థానంలోనే కొనసాగుతున్నాడు. సురేశ్ రైనా ఎనిమిదో ర్యాంకులో, యువరాజ్ సింగ్ 16వ, గంభీర్ 19వ ర్యాంకులో కొనసాగుతున్నారు. ఈ జాబితాలో మెక్కల్లమ్ (కివీస్) టాప్ ర్యాంకులో ఉన్నాడు.
అయితే టాప్-10 బౌలర్లలో భారత బౌలర్కు చోటు దక్కలేదు. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 16వ స్థానంలో ఉండగా, సునీల్ నరైన్ (వెస్టిండీస్) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.