Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమర్శలను పట్టించుకోను: టెండూల్కర్

Webdunia
గత ఏడాది సీనియర్లను లక్ష్యంగా చేసుకొని భారత క్రికెట్‌లో తీవ్రస్థాయిలో వచ్చిన విమర్శలను తాను పట్టించుకోలేదని టీం ఇండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. విమర్శలకు తానెప్పుడూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిప్రాయం ఉంటుంది. దీనర్థం వారి అభిప్రాయాలన్నీ వాస్తవాలు అని కాదు.

విమర్శలన్నీ ఒక్కొక్కరి అభిప్రాయాలు మాత్రమే. అందుకే వాటికి ప్రాధాన్యత ఇవ్వనని, వీటి కంటే దృష్టిపెట్టాల్సిన పెద్ద అంశాలు తనకు చాలా ఉన్నాయని సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. ప్రపంచంలో ఎప్పుడూ ఇటువంటి వాటి గురించి చర్చించే వారు ఉంటారు. వారిని చర్చించుకోనివ్వండి. నేను మాత్రం వారు చేసే విమర్శలను పట్టించుకోనని టెండూల్కర్ ఓ ఫ్యాషన్ మేగజైన్‌తో చెప్పాడు.

గత ఏడాది ఆస్ట్రేలియా భారత పర్యటన సందర్భంగా టీం ఇండియా సీనియర్లపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈ సమయంలో సచిన్ టెండూల్కర్ జట్టులోని సహచర సీనియర్లకు మద్దతుగా నిలిచాడు. దేశానికి సీనియర్ ఆటగాళ్లు చాలా విలువైన సేవలు అందించారని, వాటిని గుర్తించాల్సిన అవసరం ఉందని టెండూల్కర్ ఆ సమయంలో పేర్కొన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Solar Eclipse In 100 Years : ప్రపంచం మొత్తం చీకటైపోతే ఎలా ఉంటుంది?

భారత గగనతలంపై పాకిస్థాన్ విమానాలపై నిషేధం పొడగింపు

Nara Lokesh: మంగళగిరిలో పెట్టుబడులు పెట్టడానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా వున్నాయ్: నారా లోకేష్

క్వార్ట్జ్ అక్రమ రవాణాలో వైకాపా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. అరెస్టు తప్పదా?

ఆరేళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం.. చాక్లెట్లు కొనిపెడతానని.. మద్యం మత్తులో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tanushree Dutta: నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. ఆరేళ్ల నుంచి ఇదే తంతు

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

Show comments