Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనా ట్వీట్... కేటీఆర్ రెస్పాన్స్: థ్యాంక్యూ సార్.. వెలకమ్ సైనా!

Webdunia
శనివారం, 26 జులై 2014 (16:28 IST)
లండన్ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన అనంతరం బ్యాడ్మింటన్ తార సైనా నెహ్వాల్‌కు అప్పటి ఏపీ ప్రభుత్వం రూ. 50లక్షల నజరానా ప్రకటించింది. అయితే.. ఆ మొత్తం ఇప్పటివరకు చేతికి రాకపోవడంపై సైనా ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు ట్విట్టర్లో స్పందించారు. సైనా విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.
 
సైనాతో పాటు షూటర్ గగన్ నారంగ్ (రూ.50 లక్షలు), కబడ్డీ క్రీడాకారిణులు మమతా పూజారి, నాగలక్ష్మి (చెరో రూ.25 లక్షలు) కూడా నజరానా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమస్య తప్పక పరిష్కారమయ్యేలా చూస్తానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. వీరే కాకుండా రాష్ట్రానికి చెందిన ఒలింపియన్లంతా తమకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఇకపోతే.. సైనా ట్వీట్‌కు కేటీఆర్ స్పందించడంతో సైనా కృతజ్ఞతలు తెలిపింది. అందుకు కేటీఆర్ కూడా సానుకూలంగా ట్విట్టర్లో స్పందించారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments