Webdunia - Bharat's app for daily news and videos

Install App

టింటూకు రజతం, 50కి చేరిన భారత పతకాల సంఖ్య

Webdunia
బుధవారం, 1 అక్టోబరు 2014 (18:48 IST)
దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా భారత్ ఖాతాలో మరో వెండి పతకం చేరింది. మహిళల 800 మీటర్ల రేసులో భారత్ క్రీడాకారిణి టింటూ లుకా ఈ వెండి పతకాన్ని సాధించింది.
 
1:59:19 సెకన్లలో గమ్యస్థానాన్ని చేరుతుని ఈ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. అలాగే భారత్‌కు చెందిన మరో క్రీడాకారిణి సుష్మా దేవి నాల్గవ స్దానంలో నిలిచింది.
ఆమె 2:01:92 సెకన్లలో గమ్యస్థానాన్ని చేరుకుంది. మహిళల జావిలిన్ త్రోలో భారత్‌కు కాంస్య పతకం దక్కింది. 
 
జావిలిన్ త్రోలో అన్ను రాణి సాధించిన ఈ మెడల్‌తో భారత్‌కు పతకాల పట్టికలో 50 మెడల్ వచ్చి చేరింది. దీంతో దక్షిణ కొరియాలో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్ పతకలా పట్టికలో 7 బంగారు, 9 వెండి, 34 కాంస్య పతకాలు సాధించింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments