Webdunia - Bharat's app for daily news and videos

Install App

థాయ్‌లాండ్ ఓపెన్‌ ఫైనల్లో పీవీ సింధు

థాయ్‌‌లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఫైనల్‌‌కు చేరింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ విభాగం సెమీఫైనల్లో సింధు 21-23, 16-21, 21-9 తేడాతో గ్రెగరియా మరిస్కాపై విజయ

Webdunia
ఆదివారం, 15 జులై 2018 (11:17 IST)
థాయ్‌‌లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఫైనల్‌‌కు చేరింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ విభాగం సెమీఫైనల్లో సింధు 21-23, 16-21, 21-9 తేడాతో గ్రెగరియా మరిస్కాపై విజయం సాధించింది. 29వ ర్యాంకర్‌ గ్రెగరియా సింధుకు గట్టి పోటీ ఇచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది.
 
ఆకరులో అనవసర తప్పిదాలతో గ్రెగరియా పాయింట్లు సమర్పించుకోవడంతో గేమ్‌ సింధు సొంతమైంది. రెండో గేమ్‌ సింధు దూకుడుగా ప్రారంభించింది. అయితే ఆ తర్వాత గ్రెగారియా పుంజుకుని 21-16తో గేమ్‌‌ను సొంతం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌‌లో సింధు చెలరేగి ఆడింది. మొదటి నుంచి ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం సాధించింది. సింధు ధాటికి గ్రెగరియా చేతులెత్తేసింది. దీంతో సింధు 21-9తో గేమ్‌‌తో పాటు మ్యాచ్‌‌ను సొంతం చేసుకుంది. 
 
కాగా, ఆదివారం జరిగే ఫైనల్ పోటీల్లో సింధు.. జపాన్‌ క్రీడాకారిణి ఒకుహారాతో తలపడనుంది. వీరిద్దరూ ఇప్పటి వరకు 10సార్లు తలపడగా చెరో ఐదుసార్లు గెలిచారు. చివరిసారిగా వీరిద్దరూ ఈ యేడాది మార్చిలో జరిగిన ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌‌లో తలపడగా, ఈ మ్యాచ్‌లో సింధు పైచేయిగా నిలిచింది. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments