Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో టేబుల్ టెన్నిస్ ప్లేయర్ విశ్వ దుర్మరణం

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (15:27 IST)
మేఘాలయా రాష్ట్రంలోని షాన్‌బంగ్లా సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వర్థమాన టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు విశ్వ దీనదయాళన్ దుర్మరణం పాలయ్యారు. సోమవారం 83వ సీనియర్ నేషనల్, అంతర్రాష్ట్ర టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభంకానున్నాయి. వీటిలో పాల్గొనేందుకు విశ్వ వెళ్లాడు. 
 
తమిళనాడుకు చెందిన 18 యేళ్ల విశ్వతో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు గౌహతి నుంచి షిల్లాంగ్‌కు ఆదివారం సాయంత్రం ఓ కారులో బయలుదేరారు. ఈ కారు ఎన్.హెచ్-6పై షాన్‌బంగ్లా వద్దకు చేరుకోగానే ఓ ట్రక్కు వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో విశ్వ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు ఆటగాళ్లు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. 
 
వీరిద్దరినీ పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం పట్ల మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభంకానున్న డబ్ల్యూటీటీ యూత్ టోర్నీలో భారత్ తరపున విశ్వ ప్రాతినిథ్యం వహించాల్సివుంది. కానీ, ఇంతలోనే మృత్యువు కబళించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

Prakash Raj: బెట్టింగ్ యాప్‌ కేసు.. ఈడీ ముందు హాజరైన ప్రకాష్ రాజ్

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

తర్వాతి కథనం
Show comments