రాజీవ్ - అర్జున - ద్రోణ - ధ్యాన్చంద్ అవార్డు గ్రహీతలు వీరే...
ఈ సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం రాజీవ్ ఖేల్రత్న,అర్జున, ద్రోణాచర్య, ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించింది. క్రీడల్లో విశిష్టంగా రాణించిన వారికి ఈ పురస్కారాలను అందజేస్తారు.
ఈ సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం రాజీవ్ ఖేల్రత్న,అర్జున, ద్రోణాచర్య, ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించింది. క్రీడల్లో విశిష్టంగా రాణించిన వారికి ఈ పురస్కారాలను అందజేస్తారు. పారా అథ్లెట్ దేవేంద్ర జజరియా(జావ్లిన్ త్రో), హాకీ ప్లేయర్ సర్దార్ సింగ్లకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డులు దక్కాయి. ద్రోణాచార్యకు ఈసారి ఏడు మంది ఎంపికయ్యారు. ఈ అవార్డు గ్రహీతల వివరాలను పరిశీలిస్తే...
ధ్యాన్చంద్ను అవార్డు గ్రహీతలు... ధ్యాన్చంద్ అవార్డుకు ఎంపికైన వారిలో భూపేంద్ర సింగ్(అథ్లెటిక్స్), సయ్యిద్ షాహిద్ హకిమ్(ఫుట్బాల్), సుమరాయ్ టీటీ(హాకీ)లు ఉన్నారు. ఈనెల 29న రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేస్తారు. అవార్డు గ్రహీతలకు మెడల్, ప్రశంసా పత్రంతో పాటు నగదు ప్రైజ్ను అందజేస్తారు. రాజీవ్ ఖేల్ రత్నాలకు రూ.7.5 లక్షలు, అర్జున, ద్రోణాచర్య, ధ్యాన్చంద్ అవార్డు గ్రహీతలకు సర్టిఫికెట్తో పాటు రూ.5 లక్షల నగదు బహుమతిని ఇస్తారు.