Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌తో సానియా మీర్జా భేటీ : డబ్ల్యూటీఏ టైటిల్‌తో హ్యాపీ!

Webdunia
గురువారం, 30 అక్టోబరు 2014 (11:48 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా క్యాంప్ ఆఫీసులో కలిశారు. సానియా డబ్ల్యూటీఏను గెలుచుకున్న నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన సానియా కేసీఆర్‌తో భేటీ అయ్యారు. 
 
సానియా తెలంగాణ రాష్ట్రానికి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు, అంతర్జాతీయ ప్రీమియర్‌ టెన్నిస్‌ లీగ్‌ (ఐపీటీఎల్‌)లో స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ పెదరర్ జట్టులో తాను కూడా ఉండడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని వెల్లడించారు. 
 
అంతర్జాతీయ స్థాయి దిగ్గజ ఆటగాళ్లు ఐపీటీఎల్‌లో ఆడడం భారత్‌ లాంటి దేశాల్లో టెన్నిస్‌ అభివృద్ధికి దోహదపడుతుందని బుధవారం చెప్పారు. ఐపీటీఎల్‌ తప్పకుండా సక్సెస్‌ అవుతుందని సానియా మీర్జా వెల్లడించారు. 
 
కాగా వచ్చే నెల ఆరంభంకానున్న ఐపీటీఎల్‌లో భారత్‌తో కలిపి మొత్తం నాలుగు ప్రాంఛైజీలున్నాయి. ఈ టోర్నీలో ఫెడరర్‌, జొకోవిచ్‌, ఆండీ మర్రే, పీట్‌ సంప్రాస్‌ లాంటి ఆటగాళ్లు ఆడనున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments