Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో ఒలింపిక్స్: సత్తాచాటిన తెలుగుతేజం పీవీ సింధు.. సెమీఫైనల్లోకి ఎంట్రీ..

ప్రతిష్టాత్మక రియో ఒలంపిక్స్‌లో తెలుగు తేజం పీవీ సింధు సత్తా నిరూపించుకుంది. అసాధారణ ఆటతో భారత్‌కు పతకాన్ని ఖాయం చేసింది. రియోలో పీవీ సింధు అద్భుత ఆటతీరుతో సెమీఫైనల్లోకి చేరుకుంది. మంగళవారం జరిగిన క్వ

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2016 (09:20 IST)
ప్రతిష్టాత్మక రియో ఒలంపిక్స్‌లో తెలుగు తేజం పీవీ సింధు సత్తా నిరూపించుకుంది. అసాధారణ ఆటతో భారత్‌కు పతకాన్ని ఖాయం చేసింది. రియోలో పీవీ సింధు అద్భుత ఆటతీరుతో సెమీఫైనల్లోకి చేరుకుంది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో చైనా షట్లర్‌ వాంగ్‌ యీపై 22-20, 21-19 తేడాతో వరుస సెట్లలో గెలిచింది. పోటాపోటీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి ముందంజ వేసినప్పటికీ సింధూ ధీటుగా రాణించి గెలుపును నమోదు చేసుకుంది. 
 
ఇదిలా ఉంటే.. రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన భారత క్రీడాకారులకు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఒలింపిక్స్‌లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించి పసిడి సాధించే క్రీడాకారులు ఒక్కొక్కరికి రూ. 6 కోట్లు బహుమతిగా అందజేస్తామని హర్యానా క్రీడలశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ ప్రకటించారు. విశ్వక్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులను ప్రోత్సహించేందుకుగాను ప్రస్తుతం రియోలో ఉన్న అనిల్‌ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. భారత క్రీడాకారులు పతకం కోసం తీవ్రంగా పోరాడుతున్నారని అనిల్ చెప్పుకొచ్చారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments