Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగపూర్ ఓపెన్ ఫైనల్‌లోకి పీవీ సింధు.. అది జరిగితే..?

Webdunia
శనివారం, 16 జులై 2022 (13:08 IST)
భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు సింగపూర్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ చేరుకుంది. జపాన్‌ అమ్మాయి సయినా కవాకమితో జరిగిన సెమీస్‌లో 21-15, 21-7 తేడాతో విజయం సాధించింది. 
 
తక్కువ ర్యాంకు ప్రత్యర్థిని కేవలం 31 నిమిషాల్లోనే ఇంటికి పంపించేసింది. స్వర్ణం సాధిస్తే 2022లో సింధు ఖాతాలో తొలి సూపర్‌ 500 టైటిల్‌ పడుతుంది.
 
కవాకమినితో పోరుకు సింధు మల్లగుల్లాలు పడింది. వీరిద్దరూ గతంలో తలపడిన రెండు మ్యాచుల్లోనూ తెలుగు తేజానిదే పైచేయి. సెమీస్‌లోనూ ఆమె అదే జోరు ప్రదర్శించింది. 
 
వరుస స్మాష్‌లతో చెలరేగింది. కానీ రెండో గేమ్‌లో కవాకమి తేలిపోయింది. షటిల్‌పై నియంత్రణ లేకపోవడంతో 0-5తో వెనకబడింది.
 
సింధు అదే పనిగా ర్యాలీలు ఆడించి ప్రత్యర్థిని దెబ్బతీసింది. తప్పులు చేసేలా ఉసిగొల్పింది. 11-4తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరు కొనసాగించి 17-5తో విజయానికి చేరువైంది. 21-7తో గేమ్‌తో పాటు మ్యాచునూ ముగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments