Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారిస్ ఒలింపిక్స్ : చేజారిన పతకం.. నాలుగో స్థానానికి మను బాకర్ పరిమితం!!

సెల్వి
శనివారం, 3 ఆగస్టు 2024 (14:23 IST)
పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత షూటర్ మను బాకర్‌కు శనివారం నిరాశ ఎదురైంది. ఆమెకు మూడో పతకం తృటిలో చేజారింది. 25 మీటర్ల పిస్టోల్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచారు. ఫలితంగా ఆమె ఖాతాలో మరో పతకం చేజారిపోయింది. అయితే, మను బాకర్ మాత్రం ఇప్పటికే రెండు కాంస్య పతకాలను గెలుచుకున్న విషయం తెల్సిందే. ఈ పతకాలతో ఆమె స్వదేశానికి చేరుకోనున్నారు. 
 
ఈ క్రీడా పోటీల్లో భాగంగా, శనివారం 25 మీటర్ల పిస్టోల్ విభాగంలో ఫైనల్ స్టేజ్ వన్ను మను బాకర్ కాస్త నెమ్మదిగా ప్రారంభించింది. ఇక్కడ సిరీస్ 1లో కేవలం 2 షాట్లను మాత్రమే కొట్టింది. ఆ తర్వాత మాత్రం మెరుగైన ప్రదర్శన చేసింది. సిరీస్ 2లో నాలుగు, సిరీస్ 3లో నాలుగు షాట్లు కొట్టి పైకి ఎగబాకింది. సిరస్ 6 వరకు అత్యుత్తమంగా షూట్ చేసిన మనుభాకర్ ఏకంగా రెండో స్థానానికి చేరుకుంది.
 
ప్రత్యర్థి షూటర్లు కూడా మంచి ప్రదర్శన కనబరచడంతో పోటీని ఎదుర్కొంది. ఎలిమినేషన్ చివరి సిరీస్ 8లో కేవలం రెండు షాట్లను మాత్రమే కొట్టడంతో మను బాకర్ రేసులో వెనుకబడిపోయింది. హంగేరీ అథ్లెట్ కామెలీ 3 షాట్లతో మూడో స్థానానికి చేరుకుంది. దీంతో మనుభాకర్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. కాగా, ఈ ఒలింపిక్ పోటీల్లో మహిళల విభాగంలో ఒక కాంస్యాన్ని, మిక్స్డ్ విభాగంలో మరో కాంస్యాన్ని గెలుచుకుంది. రెండు పతకాలతో ఆమె భారత్ తిరిగిరానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

తర్వాతి కథనం
Show comments