మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో బుధవారం మరో సంచలనం నమోదు చేసుకుంది. ఈ టోర్నీ నుంచి వీనస్ విలియమ్స్ నిష్క్రమించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో మ్యాడిసన్ కిస్ చేతిలో వీనస్ పరాజయం పాలైంది. 3-6, 6-4, 4-6 స్కోరు తేడాతో కిస్ చేతిలో ఓటమి చవిచూసిన వీనస్ టోర్నీ నుంచి వైదొలగింది.
కాగా, ఇప్పటికే పురుషుల సింగిల్స్ లో రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్లతో పాటు మహిళల సింగిల్స్లో అజరెంకా కూడా టోర్నీ నుంచి నిష్క్రమించారు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఈ ఏడాది కొత్త తరం చాంపియన్లు అవతరించే అవకాశాలున్నాయి.