ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)కు రంగం సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక లీగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. భారత్కు చెందిన ఇండియన్ ఏసెస్, సింగపూర్ స్లామర్స్ మధ్య మనీలాలో జరిగే మ్యాచ్తో లీగ్ ప్రారంభం కానుంది.
తొలుత పురుషులు సింగిల్స్లో గేల్ మోన్ఫిల్స్ (ఇండియన్ ఏసెస్), థామస్ బెర్డిచ్ తలపడనుండగా, ఆ వెంటనే జరిగే మహిళల సింగిల్స్లో అనా ఇవనోవిచ్ (ఏసెస్).. డానియెల హంతుచోవాతో బరిలోకి దిగనుంది.