Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియా చిత్తు - థామస్ కప్ విజేతగా భారత్

Webdunia
ఆదివారం, 15 మే 2022 (17:36 IST)
బ్యాంకాక్ వేదికగా జరిగిన థామస్ కప్ పైనల్ పోటీల్లో భారత్ చరిత్ర సృష్టించింది. థామస్ కప్ విజేతగా ఆవిర్భవించింది. ఇప్పటివరకు 14 సార్లు విజేతగా నిలిచిన ఇండోనేషియాపై చారిత్రాత్మక విజయాన్ని భారత్ నమోదు చేసుకుంది. అద్భుత ఆటతీరుతో భారత ఆటగాళ్ళు తుదిపోరులో ఇండోనేషియాను ఊపిరి పీల్చుకోని విధంగా చేశారు. ఫలితంగా ప్రత్యర్థిపై 3-0 తేడాతో విజయభేరీ మోగించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత 20 యేళ్ళ యువ ఆటగాడు లక్ష్యసేన్ 8-21, 21-17, 21-16 తేడాతో ఒలింపిక్స్ రజత పతక విజేత ఆంథోనీపై గెలుపొందారు. దీంతో భారత్ 1-0 ఆధిక్యంతో అందించాడు. ఆ తర్వాత డబుల్స్‌లో తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడీ 18-21, 23-21, 21-19తో మహ్మద్ అహసన్ - సంజయ సుకమౌల్జో‌పై గెలుపొందారు. 
 
దీంతో ఇండోనేషియాపై 2-0 ఆధిక్యంతో  భారత్ దూసుకెళ్లింది. ఈ రెండు గేముల్లోనూ తొలి సెట్‌ను కోల్పోయి మరీ విజయం సాధించడం విశేషం. ఇక ఆఖరి గేమ్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ 21-15, 23-21 వరుస సెట్లలో జోనాథన్ క్రిస్టీని బోల్తా కొట్టించి 30 ఆధిక్యంతో థామస్ కప్‌ను కేవసం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments