Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ వీధుల్లో పశువులు - కోతులే ఉంటాయి.. బాస్కెట్ బాల్ స్టార్

భారత్ గురించి ప్రపంచ దేశాలన్నీ గొప్పగా చెప్పుకుంటాయి. ముఖ్యంగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఎంతగానో ప్రశంసిస్తుంటారు. అయితే, ప్రపంచ బాస్కెట్ బాల్ అటగాళ్లలో అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో ఒకడైన ఎన్బీఏ

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2017 (10:40 IST)
భారత్ గురించి ప్రపంచ దేశాలన్నీ గొప్పగా చెప్పుకుంటాయి. ముఖ్యంగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఎంతగానో ప్రశంసిస్తుంటారు. అయితే, ప్రపంచ బాస్కెట్ బాల్ అటగాళ్లలో అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో ఒకడైన ఎన్బీఏ స్టార్ ఆటగాడు కెవిన్ దురాంత్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
గోల్డెన్ స్టేట్ వారియర్స్ తరఫున బాస్కెట్ బాల్ ఆడే కెవిన్ ఇటీవల తాను జరిపిన భారతీయ పర్యటనపై తన అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు. ఈ వ్యాఖ్యలే ఇపుడు సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారాయి. భారతీయులకు ఎంతమాత్రమూ తెలివితేటలు లేవని, నాలెడ్జ్ విషయంలో ఇండియన్స్ 20 ఏళ్లు వెనకుండి పోయారన్నారు. 
 
"ఇక్కడ నాకు వినూత్న అనుభూతి లభించింది. వాస్తవానికి ఇండియా గురించి నాకేమీ తెలియదు. నేను ఎక్కడికి వెళ్లినా ఆ దేశాల గురించి కొంతైనా తెలుసుకుని వెళ్లినవే. కానీ ఇండియాకు అలా రాలేదు. దుబాయ్‌కి వచ్చి, అక్కడి నుంచి ఇండియాకు వెళ్లాను. ఇక్కడి సంస్కృతిని చూశాను. తెలివితేటలు, అనుభవం విషయంలో ఇక్కడి ప్రజలు 20 ఏళ్లు వెనుకంజలో ఉన్నారు. 
 
ఇప్పటికీ వీధుల్లో పశువులు తిరుగుతున్నాయి. కోతులు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తుంటాయి. రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపై వందలాది మంది పడున్నారు. ఎవరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు. అత్యధికులు పేదలే" అన్నాడు. తాను సందర్శించిన తాజ్ మహల్ గురించి వివరిస్తూ, దీన్ని కాపాడటంలో మాత్రం భారత్ విజయం సాధించిందని, ఇక్కడ చాలా పరిశుభ్రత కనిపించిందని చెప్పాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మా బావే... వీడు చస్తేనే మా అక్క ప్రశాంతంగా ఉంటుంది..

నేడు బీహార్ సర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

సింగపూర్‌లో తెలుగును రెండో అధికార భాషగా గుర్తించాలి : సీఎం చంద్రబాబు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments