Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాకీ వరల్డ్‌ లీగ్‌ : డ్రాగా ముగిసిన దాయాదుల పోరు

Webdunia
శనివారం, 27 జూన్ 2015 (12:48 IST)
బెల్జియం వేదికగా శుక్రవారం అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన హాకీ వరల్డ్‌ లీగ్‌లో పోటీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. గోల్‌ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ... మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్లూ సమాన గోల్స్ చేశాయి. దీంతో మ్యాచ్‌ 2-2తో డ్రాగా ముగిసింది. ఈ టోర్నీలో ఓటమెరుగని భారత్‌ గ్రూప్‌-ఎలో మళ్లీ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. 
 
ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లలో భారత్ విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే. దీంతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌పై ఉత్కంఠత నెలకొంది. కానీ, ఈ మ్యాచ్‌ 2-2తో డ్రా అయింది. అయితే, ఈ మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగిందని చెప్పాలి. 
 
వచ్చే ఒలింపిక్స్‌కు ఇప్పటికే అర్హత సాధించడంతో భారత్‌ ఈ మ్యాచ్‌లో స్వేచ్ఛగా ఆడింది. అయితే రియో బెర్తే లక్ష్యంగా బరిలోకి దిగిన పాక్‌ మాత్రం దూకుడుగా ఆడినప్పటికీ సర్దార్‌ సేనను ఓడించలేకపోయింది. 
 
భారత ఆటగాడు రమణ్‌ దీప్‌ 13, 39వ నిమిషాల్లో రెండు ఫీల్డ్‌ గోల్స్‌ చేశాడు. మరోవైపు పాక్‌ కెప్టెన్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ 23వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌ను, 37వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్స్‌గా మలిచాడు. దీంతో ఇరు జట్లూ సమానంగా రెండు గోల్స్ చేసి స్కోరును పంచుకున్నాయి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments