Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా సృష్టించిన కొత్త చరిత్ర ఏంటి?

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (12:54 IST)
భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా కొత్త చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్ బంగారు పతక విజేత అయిన చోప్రా... తాజాగా జావెలిన్ త్రోలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ చాంపియన్ షిప్ టోర్నీలో పాల్గొనడం ద్వారా తొలి భారత క్రీడాకారుడుగా గుర్తింపు పొందారు. 
 
ఈ టోర్నీలోభాగంగా గురువారం రాత్రి స్విట్జర్‌ల్యాండ్‌లోని జురిచ్‌లో జరిగిన ఫైనల్ పోటీలో చోప్రా బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలో ఆరు మెటి జావెలిన్ త్రోయర్లు పోటీపడిన ఈ చాంపియన్ పోటీలో నీరజ్ చోప్రా తన బల్లెంను అత్యధికంగా 88.44 మీటర్లుగా విసిరి విజేతగా నిలిచాడు. తన తొలి ప్రయత్నంలోనే చోప్రా అందరికంటే ఎక్కువ దూరం విసిరి గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు. 
 
కాగా, గాయం కారణంగా కామన్వెల్త్ క్రీడలకు దూరమైన చోప్రా.. నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకుని జూలై ఆఖరులో లాసానె డైమండ్ లీగ్‌లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఫలితంగా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. డైమండ్ లీగ్ ఫైనల్లో అతను పోటీ పడటం ఇది మూడోసారి. గతంలో 2017, 2018 ఎడిషన్స్‌లో ఫైనల్స్ ఆడినా... వరుసగా ఏడు, నాలుగో స్థానాలతో సరిపెట్టాడు. ఈసారి మాత్రం స్వర్ణంతో తిరిగొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments