Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపికా పల్లికల్‌కు కాంస్యం.. రూ. 20లక్షల నజరానా!

Webdunia
సోమవారం, 22 సెప్టెంబరు 2014 (18:33 IST)
17వ ఆసియా క్రీడల్లో భాగంగా సోమవారం జరిగిన స్క్వాష్ మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో భారత్ స్టార్ ప్లేయర్ దీపికా పల్లికల్ ఓటమి చవిచూసింది. మలేషియాకు చెందిన నికోలస్ డేవిడ్ చేతిలో 4-11, 4-11, 5-11 తేడాతో దీపికా సెమీస్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సెమీస్‌లో ఓటమి పాలైనప్పటికీ... దీపిక కాంస్యాన్ని ఖరారు చేసుకుంది.
 
ఇకపోతే.. ఆసియా క్రీడల్లో స్క్వాష్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత దేశానికి కాంస్యపతకం అందించిన దీపికా పల్లికల్‌కు తమిళనాడు ప్రభుత్వం రూ.20 లక్షల రూపాయలను నజరానాగా ప్రకటించింది. 
 
ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దీపికకు లేఖ రాశారు. దీపిక పతకం సాధించడం తమిళనాడుకు గర్వకారణమని లేఖలో ఆమె పేర్కొన్నారు. దేశ కీర్తిని ఇనుమడింప చేసినందుకు తమిళ ప్రజల తరపున హృదయ పూర్వక అభినందనలు తెలుపుతున్నానని ఆమె లేఖ ద్వారా తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments