Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషుల వాలీబాల్ మ్యాచ్‌కెళ్లిన పాపం.. జైలులోనే?

Webdunia
గురువారం, 16 అక్టోబరు 2014 (18:37 IST)
పురుషుల వాలీబాల్ మ్యాచ్‌కెళ్లిన పాపానికి ఓ మహిళ జైలు జీవితం కొనసాగిస్తోంది. ఇరాన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇరాన్ మహిళలపై ఆంక్షలు కఠినంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో బ్రిటీష్-ఇరానియన్ మహిళ ఘోంచే ఘవామీ పురుషుల వాలీబాల్ మ్యాచ్‌కు హాజరవడమే కాక, "మీరు కూడా వాలీబాల్ మ్యాచ్‌లకు వెళ్ళగలగాలి" అని ఇతర మహిళలకు పిలుపునిచ్చింది. అదే ఆమె చేసిన నేరం! వెంటనే ఇరాన్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. రిమాండ్ ఖైదీగా ఆమెను ఇప్పటికే మూడు నెలలకు పైగా జైల్లో ఉంచారు. 
 
కాగా లా గ్రాడ్యుయేట్ అయిన ఘవామీ టెహ్రాన్‌లోని ఆజాదీ స్టేడియంలో జరుగుతున్న ఇరాన్-ఇటలీ పురుషుల వాలీబాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్ళింది. ఇరాన్‌లో క్రీడాపోటీల సందర్భంగా మహిళలు పురుష ప్రేక్షకులతో కలిసి కూర్చోవడం నిషిద్ధం. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు. 
 
గతవారం ఆమె జైలులో నిరసన దీక్ష చేపట్టారు. ఘవామీ వ్యవహారంపై స్పందించిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆమెను విడుదల చేయాలంటూ సంతకాల సేకరణ చేపట్టింది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్