Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌- సింధుకు పతకం ఖాయం.. సైనా ఓటమి

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం పీవీ సింధు సెమీఫైనల్లోకి చేరుకుని పతకాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు అదరగొట్టింది. ఈ క్రమంలో ప్రపంచ మూడో

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (10:56 IST)
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం పీవీ సింధు సెమీఫైనల్లోకి చేరుకుని పతకాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు అదరగొట్టింది. ఈ క్రమంలో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు.. ఆరో ర్యాంకర్ ఒకహరను ఓడించింది. హోరాహోరీ పోరులో సింధు 21-17, 21-19తో ఒకుహరపై విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక శనివారం జరిగే సెమీఫైనల్లో అకానే యమగుచితో సింధు తలపడనుంది.
 
మరోవైపు ఇదే టోర్నీలో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు ఓటమిని చవిచూసింది. క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్‌ 6-21, 11-21తో ఒలింపిక్‌ ఛాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) చేతిలో పరాజయం చవిచూసింది.
 
ఇకపోతే.. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌ 12-21, 12-21తో ఆరో సీడ్‌ కెంటొ మొమొట (జపాన్‌) చేతిలో ఖంగుతిన్నాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్స్‌లో సాత్విక్‌ సాయిరాజు- అశ్విని పొన్నప్ప 17-21, 10-21తో జెంగ్‌ సీవీ- హువాంగ్‌ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments