ఆసియా క్రీడల్లో భారత మహిళల ఫుట్బాల్ జట్టు శుభారంభం చేసింది. మాల్దీవ్స్తో జరిగిన పూల్ మ్యాచ్లో 15-0 తేడాతో విజయభేరి మోగించింది. భారత్ విజృంభణకు మాల్దీవ్స్ క్రీడాకారిణుల నుంచి ఏ దశలోనూ సమాధానం లేకపోయింది.
మ్యాచ్ మొదలైన ఐదో నిమిషంలోనే వింగర్ సస్మిత మాలిక్ గోల్ సాధించి భారత్ ఖాతాను తెరిచింది. ఆ తర్వాత ఆమె 21, 26, 80, 88 నిమిషాల్లో మరో నాలుగు గోల్స్ చేసింది. మిడ్ఫీల్డర్ కమలా దేవి 18, 23, 31, 45 (+3), 65 నిమిషాల్లో మొత్తం ఐదు గోల్స్ నమోదు చేసి, సస్మితతో సమవుజ్జీగా నిలిచింది.
బాలా దేవి 20, 45 (+2) రెండు గోల్స్ సాధించగా, కెప్టెన్ బెంబెమ్ దేవి, స్ట్రయికర్ ప్రమేష్వొరీ దేవి, డిఫెండర్ ఆశాలతా దేవి తలా ఒక గోల్ చేశారు. గ్రూప్ ‘ఎ’లో జరిగిన ఈ మ్యాచ్ని గెల్చుకున్న భారత్కు మూడు పాయింట్లు లభించాయి.
భారత మహిళలు తర్వాతి మ్యాచ్ని 17న దక్షిణ కొరియాతో ఆడతారు. పూల్ దశలో చివరి మ్యాచ్లో థాయిలాండ్ను 21న ఎదుర్కొంటారు.