Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ ఖాతాలో మరొకటి.. అమిత్ పంఘాల్ పంచ్‌కు స్వర్ణం

భారత్ ఖాతాలో మరో స్వర్ణపతకం వచ్చి చేరింది. జకర్తా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడా పోటీల్లో భాగంగా, శనివారం జరిగిన లైట్ ఫ్లై విభాగం ఫైనల్‌లో స్వదేశానికి చెందిన అమిత్ పంఘాల్ విజేతగా నిలిచాడు. ఫలితంగ

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2018 (13:31 IST)
భారత్ ఖాతాలో మరో స్వర్ణపతకం వచ్చి చేరింది. జకర్తా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడా పోటీల్లో భాగంగా, శనివారం జరిగిన లైట్ ఫ్లై విభాగం ఫైనల్‌లో స్వదేశానికి చెందిన అమిత్ పంఘాల్ విజేతగా నిలిచాడు. ఫలితంగా బంగారు పతకం వరించింది.
 
ఈ పోటీ ఫైనల్లో అమిత్‌ 3-2 తేడాతో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన హసన్‌బోయ్‌ దుస్మతోమ్‌పై విజయం సాధించాడు. ఈ ఏషియాడ్‌లో ఫైనల్‌ చేరిన ఏకైక భారత బాక్సర్‌ అమితే కావడం గమనార్హం. 
 
2016 రియో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత దుస్మతోమ్‌పై విజయం సాధించడంతో అమిత్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హర్యానాకు చెందిన అమిత్‌ ఈ ఏడాది గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం సాధించాడు. ఆ ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది 14వ స్వర్ణం. ఇప్పటివరకు భారత్‌ ఖాతాలో 66 పతకాలు వచ్చి చేరాయి. ఇందులో 14 స్వర్ణాలు, 23 రజతాలు, 29 కాంస్యాలు ఉన్నాయి. 
 
కాగా, ఇప్పటివరకు జరిగిన ఆసియా క్రీడల్లో భారత్‌ అత్యధికంగా 2010లో 65 పతకాలను గెలుచుకుంది. వీటిలో 14 స్వర్ణాలు, 17 రజతాలు, 34 కాంస్యాలు ఉన్నాయి. తాజా ఆసియా క్రీడల్లో భారత్‌ గత రికార్డును తిరగరాసి 66 పతకాలతో ప్రస్తుతం 8వ స్థానంలో కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments