Webdunia - Bharat's app for daily news and videos

Install App

థామస్‌-ఉబెర్‌కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో పతకంపై కన్నేసిన సైనా జట్టు

Webdunia
ఆదివారం, 15 మే 2016 (09:58 IST)
చైనాలోని కున్షాన్ వేదికగా థామస్ ఉబెర్ బ్యాడ్మింటన్ టోర్నీ ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. కిందటిసారి కాంస్యంతో చరిత్ర సృష్టించిన సైనా నేతృత్వంలో భారత మహిళల జట్టు ఈ సారి ప్రధాన పతకంపైనే గురిపెట్టి బరిలోకి దిగుతోంది. 
 
నిజానికి భారత మహిళల జట్టు గత 2010లో ఉబెర్‌కప్‌ క్వార్టర్‌ఫైనల్‌ చేరింది. కానీ, తొలి పతకం (కాంస్యం) గెలిచింది మాత్రం 2014లోనే. ఈసారి 2014 రన్నరప్‌ జపాన్‌, ఆస్ట్రేలియా, జర్మనీలు వంటి బలమైన ప్రత్యర్థులు ఉన్న జట్టులో ఉన్నప్పటికీ.. ఈ ధఫా మాత్రం పతకం సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. 
 
ఒక పోరులో మూడు సింగిల్స్‌, రెండు డబుల్స్‌ మ్యాచ్‌లు ఉంటాయి. మూడో సింగిల్స్‌లో ఆడేందుకు రుత్విక శివాని, తన్వీ లాడ్‌, పీసీ తులసి మధ్య పోటీ ఉంది. అయినప్పటికీ.. ఈ టోర్నీలో ప్రధాన బాధ్యత సైనా, సింధులపై ఉంది. 
 
రియో ఒలింపిక్స్‌ అర్హత సాధించిన జంట గుత్తా జ్వాలా, అశ్విని పొన్నప్పలు డబుల్స్‌లో బరిలోకి దిగనున్నారు. రెండో జంటగా సిక్కి రెడ్డి, మనీషా ఆడతారు. తన తొలి మ్యాచ్‌లో భారత్‌ మహిళల జట్టు సోమవారం ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. ఆ తర్వాతి రెండు రోజుల్లో జర్మనీ, జపాన్‌లను ఎదుర్కొంటుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

తర్వాతి కథనం
Show comments