Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్.. సింధు-సైనాల వార్‌ లేదు.. క్వార్టర్స్‌తోనే కథ ముగిసింది..

ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత పోరు ముగిసింది. భారత క్రీడాకారులు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో భారత్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో భారత్ తరపున పాల్గొన్న తెలు

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (17:42 IST)
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత పోరు ముగిసింది. భారత క్రీడాకారులు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో భారత్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో భారత్ తరపున పాల్గొన్న తెలుగు తేజం పీవీ సింధు, సైనా నెహ్వాల్‌కు క్వార్టర్ ఫైనల్లో వెనుదిరగడంతో.. అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో విజయం సాధిస్తే.. సెమీఫైనల్లో వీరిద్దరి మధ్యే పోటీ ఉంటుందని తెలుసుకున్న ఫ్యాన్స్.. క్వార్టర్ ఫైనల్ ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. 
 
కానీ పీవీ సింధును క్వార్టర్ ఫైనల్‌లో 14-21, 10-21 పాయింట్ల తేడాతో ప్రపంచ నెంబర్‌ వన్‌, చైనీస్ తైపీకి చెందిన తై జు యింగ్‌ ఓడించింది. అలాగే మరో క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్‌ను 14-21, 10-21 పాయింట్ల తేడాతో ప్రపంచ మూడో ర్యాంకర్, కొరియాకు చెందిన సుంగ్‌ జి హ్యున్‌ ఓడించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో తప్పిదాలతో మ్యాచ్‌లను కోల్పోయారు. ఫలితంగా క్వార్టర్స్‌తోనే ఇంటి ముఖం పట్టారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments