Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు.. కీలక వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్.బి.ఐ

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2016 (17:45 IST)
ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం.. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవడం.. క్రూడ్‌ ఆయిల్‌ రేట్లు పతనమవ్వడం.. పనామా పేపర్స్‌ లీక్‌ వ్యవహారం బయటపడటంతో మంగళవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఫలితంగా బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్‌ సూచీ 516 పాయింట్ల మేరకు నష్టపోయి 24883 వద్ద, నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయి 7603 వద్ద ముగిశాయి. బీపీసీఎల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌సీఎల్‌, లుపిన్‌ షేర్లు లాభపడగా.. అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు నష్టపోయాయి. 
 
అంతకుముందు... భారత రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష వివరాలను ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం వెల్లడించారు. రెపోరేటు పావు శాతం తగ్గి 6.75 శాతం నుంచి 6.50 శాతానికి చేరింది. రివర్స్ రెపో రేటును పావుశాతం పెంచారు. నగదు నిల్వల నిష్పత్తిలో ఎలాంటి మార్పు లేదని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. రెపోరేటు 0.25 శాతం తగ్గడంతో గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు తగ్గే అవకాశముంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

Show comments