Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు.. కీలక వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్.బి.ఐ

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2016 (17:45 IST)
ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం.. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవడం.. క్రూడ్‌ ఆయిల్‌ రేట్లు పతనమవ్వడం.. పనామా పేపర్స్‌ లీక్‌ వ్యవహారం బయటపడటంతో మంగళవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఫలితంగా బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్‌ సూచీ 516 పాయింట్ల మేరకు నష్టపోయి 24883 వద్ద, నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయి 7603 వద్ద ముగిశాయి. బీపీసీఎల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌సీఎల్‌, లుపిన్‌ షేర్లు లాభపడగా.. అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు నష్టపోయాయి. 
 
అంతకుముందు... భారత రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష వివరాలను ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం వెల్లడించారు. రెపోరేటు పావు శాతం తగ్గి 6.75 శాతం నుంచి 6.50 శాతానికి చేరింది. రివర్స్ రెపో రేటును పావుశాతం పెంచారు. నగదు నిల్వల నిష్పత్తిలో ఎలాంటి మార్పు లేదని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. రెపోరేటు 0.25 శాతం తగ్గడంతో గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు తగ్గే అవకాశముంది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments