Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్‌పై బీహార్ ఎన్నికల రిజల్ట్స్ ఎఫెక్ట్.. 600 పాయింట్లకు పైగా సెన్సెక్స్ నష్టం

Webdunia
సోమవారం, 9 నవంబరు 2015 (11:12 IST)
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బాంబే స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా సోమవారం ఉదయం ప్రారంభమైన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సూచీ ఏకంగా 600 పాయింట్ల మేరకు నష్టపోయింది. ఆ తర్వాత అంటే 10:45 గంటల సమయంలో 325 పాయింట్ల నష్టంలో ఉంది. 
 
బీహార్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ విజయం సాధిస్తే, పలు కీలక బిల్లులు, సంస్కరణల అమలుకు మార్గం సుగమమవుతుందని పెట్టుబడిదారులు భావించడమే ఇందుకు కారణం. అయితే, బీజేపీ ఘోర పరాభవంతో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ నుంచి బీమా సంస్కరణలు, భూసేకరణ, వివిధ రంగాల్లో ఎఫ్డీఐ పెంపు వంటి ముఖ్యమైన బిల్లులిప్పడు విపక్షాల నుంచి మరింత అడ్డంకులను ఎదుర్కోనున్నాయి. 
 
మరోవైపు 'మేకిన్ ఇండియా' అంటూ మోడీ చేపట్టిన ప్రపంచవ్యాప్త ప్రచారం అనంతరం, విదేశీ ఇన్వెస్టర్లు సైతం బీహార్ ఎన్నికలను నిశితంగా పరిశీలించారు. వీరంతా ఇప్పుడు దేశానికి పెట్టుబడులు పెట్టాలంటే మరోసారి ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక వచ్చే సంవత్సరం కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. బీహార్‌లో గెలిచి, ఆ రాష్ట్రాల్లో సత్తా చాటాలని భావించిన బీజేపీకి చుక్కెదురు కావడం కూడా ఇన్వెస్టర్ల మనోభావాలను దెబ్బతీయడంతో మార్కెట్ ట్రేడ్ నష్టాల్లో ప్రారంభమైంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

Show comments