బాంబే స్టాక్ మార్కెట్ : లాభాలతో ముగిసిన సెన్సెక్స్ సూచీ

Webdunia
గురువారం, 26 నవంబరు 2015 (17:09 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో గురువారం సెన్సెక్స్ సూచీ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్‌ 182 పాయింట్లు లాభపడి 25,958 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 7,883 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరింత బలహీన పడి రూ.66.56 వద్ద కొనసాగుతోంది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో టాటా మోటార్స్‌ సంస్థ షేర్లు అత్యధికంగా 5.49శాతం లాభపడి రూ.422.95 వద్ద ముగిశాయి. 
 
అలాగే సన్‌ ఫార్మా, ఐడియా, గెయిల్‌, రిలయన్స్‌ సంస్థల షేర్లు సైతం లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో గురువారం డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. ఔషధాల తయారీ లోపభూయిష్టంగా ఉందని లోపాలు సరిదిద్దుకోకపోతే నిషేధం విధిస్తామని ఆ సంస్థను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో ఆ ప్రభావం సంస్థ షేర్లపై కనిపించింది. 8.26శాతం నష్టపోయిన షేర్లు రూ.3,108 వద్ద ముగిశాయి. దీనితోపాటు టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, అదానీ స్పోర్ట్స్‌, బజాజ్‌ ఆటో సంస్థల షేర్లు సైతం నష్టపోయాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊహించలేనన్ని ట్విస్ట్‌లతో బరాబర్ ప్రేమిస్తా సినిమా ఉంటుంది .. చంద్రహాస్‌

ఎస్ఎస్ కార్తికేయ నిర్మాతగా ఫహాద్ ఫాజిల్ తో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ షూటింగ్ స్టార్ట్

ఏగన్ హీరోగా హైకూ షూటింగ్ రోజే నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ హక్కులు కైవసం

Naveen Chandra: మానసిక బలహీనతో షూటింగ్ లో దురుసుగా వ్యవహరించా : నవీన్ చంద్ర

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

Show comments