Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాక్ మార్కెట్ : లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2015 (17:47 IST)
దేశీయ స్టాక్ మార్కెట్‌లో గురువారం సూచీలన్నీ లాభాలతో ముగిశాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వడ్డీ రేట్లను పెంచడంతో అమెరికా మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ఆ ప్రభావం భారతీయ స్టాక్‌ మార్కెట్లపైనా పడింది. దీంతో గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు మధ్యలో కొంత ఊగిసలాటకులోనైనా త్వరగా తేరుకుని లాభాల దిశగా పయనించాయి. 
 
సెన్సెక్స్‌ 309 పాయింట్లు లాభపడి 25,803 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 93 పాయింట్లు లాభపడి 7,844 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడి రూ.66.51 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో టాటా స్టీల్‌ సంస్థ షేర్లు అత్యధికంగా 5.23శాతం లాభపడి రూ.257.50 వద్ద ముగిశాయి. 
 
వీటితోపాటు టాటా పవర్‌, హిందాల్కో, వేదాంత, రిలయన్స్‌ సంస్థల షేర్లు లాభపడ్డాయి. బాష్‌ లిమిటెడ్‌ సంస్థ షేర్లు అత్యధికంగా 2.07శాతం నష్టపోయి రూ.18,330 వద్ద ముగిశాయి. వీటితోపాటు ఐడియా, కెయిర్న్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ సంస్థల షేర్లు సైతం నష్టాలతో ముగిశాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

Show comments