Webdunia - Bharat's app for daily news and videos

Install App

నష్టాల్లో సెన్సెక్స్ .. స్వల్పంగా బంగారం ధరలు

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (18:12 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో గత రెండురోజుల మాదిరిగానే శుక్రవారం కూడా స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ప్రారంభపు ట్రేడింగ్‌లో లాభాలను చవిచూసిన సెన్సెక్స్.. కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఆ తర్వాత ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 98 పాయింట్లు నష్టపోయి 25,032 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 7,750 పాయింట్ల వద్ద స్థిరపడింది. 
 
ఈ ట్రేడింగ్‌లో అదానీ పోర్ట్స్, టాటా పవర్, ఐడియా, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు లాభపడగా, లుపిన్ సంస్థ షేర్లు అత్యధికంగానూ, అంబుజా సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, బీపీసీఎల్, రిలయన్స్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. 
 
మరోవైపు.. దేశీయంగా నగల వ్యాపారుల నుంచి బంగారం కొనుగోళ్లు పడిపోవడం, అంతర్జాతీయంగా మార్కెట్లు బలహీనంగా ఉండటంతో పసిడి ధర శుక్రవారం స్వల్పంగా తగ్గింది. రూ.50 తగ్గడంతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ.29,750కి చేరింది. అదేవిధంగా వెండి ధర కూడా తగ్గింది. రూ.500 తగ్గడంతో కిలో వెండి ధర రూ.39,950 కి చేరింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments