నష్టాల్లో సెన్సెక్స్ .. స్వల్పంగా బంగారం ధరలు

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (18:12 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో గత రెండురోజుల మాదిరిగానే శుక్రవారం కూడా స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ప్రారంభపు ట్రేడింగ్‌లో లాభాలను చవిచూసిన సెన్సెక్స్.. కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఆ తర్వాత ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 98 పాయింట్లు నష్టపోయి 25,032 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 7,750 పాయింట్ల వద్ద స్థిరపడింది. 
 
ఈ ట్రేడింగ్‌లో అదానీ పోర్ట్స్, టాటా పవర్, ఐడియా, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు లాభపడగా, లుపిన్ సంస్థ షేర్లు అత్యధికంగానూ, అంబుజా సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, బీపీసీఎల్, రిలయన్స్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. 
 
మరోవైపు.. దేశీయంగా నగల వ్యాపారుల నుంచి బంగారం కొనుగోళ్లు పడిపోవడం, అంతర్జాతీయంగా మార్కెట్లు బలహీనంగా ఉండటంతో పసిడి ధర శుక్రవారం స్వల్పంగా తగ్గింది. రూ.50 తగ్గడంతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ.29,750కి చేరింది. అదేవిధంగా వెండి ధర కూడా తగ్గింది. రూ.500 తగ్గడంతో కిలో వెండి ధర రూ.39,950 కి చేరింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

promo of Aara of Ustad: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఆరా ఆఫ్ ఉస్తాద్ ప్రోమో వచ్చేసింది

Hey Balwant review: హే భగవాన్ పేరు మారిన హే బలవంత్ మూవీ రివ్యూ

రష్మిక-విజయ్ వివాహం.. బందోబస్తు కోసం అంతర్జాతీయ భద్రతా సంస్థ

మా పూర్వీకులు భయంకరమైన ఘోరాలకు పాల్పడ్డారు: విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ వ్యాఖ్యలు

'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్ (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

తర్వాతి కథనం
Show comments