Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కలకలం ... కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (16:47 IST)
యూరప్ దేశాల్లో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ దేశాల్లో కరోనా రెండో దశ సంక్రమణ అంటే రెండో దశ ప్రారంభమైందనే వార్తలు వస్తున్నాయి. ఈ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్‌పై పడింది. ఫలితంగా స్టాక్ మార్కెట్ తీవ్ర నష్టాలను చవిచూసింది. 
 
యూరప్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీనికి తోడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణితో వ్యవహరించడంతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
 
దీంతో బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 599 పాయింట్లు నష్టపోయి 39,922కి పడిపోయింది. నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 11,729కి చేరుకుంది. టెలికాం, కన్జ్యూమర్ గూడ్స్ సూచీలు మినహా మిగిలినవన్నీ నష్టాల్లోనే ముగిశాయి.
 
ఈ రోజు స్టాక్ మార్కెట్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ భారతి ఎయిర్ టెల్ (4.26%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.17%), మారుతి సుజుకి (0.33%), ఎల్ అండ్ టీ (0.12%) కంపెనీలు ఉన్నాయి. 
 
అలాగే, ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.45%), ఐసీఐసీఐ బ్యాంక్ (-3.34%), టెక్ మహీంద్రా (-3.00%), బజాజ్ ఫైనాన్స్ (-2.41%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.39%) కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments