Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశువుల ప్రాధాన్యత పండుగ ‘కనుమ’... ఈరోజున ఏం తినాలో తెలుసా?

కనుమ పండుగ రైతులకు ముఖ్యమైన పండుగ. సంవత్సరమంతా పడిన శ్రమకు ఫలితమైన ధాన్యరాశులు నట్టింట నిలిచే రోజు. పాడిని ప్రసాదించిన గోమాతను, పంటకు సాయంగా నిలిచిన బసవన్నను ఈ రోజున రైతులు పూజిస్తారు. ఆ రోజు తెల్లవారగానే పశువులను శుభ్రంగా కడిగి, కొమ్ములకు – ముఖానికి

Webdunia
శనివారం, 14 జనవరి 2017 (18:58 IST)
కనుమ పండుగ రైతులకు ముఖ్యమైన పండుగ. సంవత్సరమంతా పడిన శ్రమకు ఫలితమైన ధాన్యరాశులు నట్టింట నిలిచే రోజు. పాడిని ప్రసాదించిన గోమాతను, పంటకు సాయంగా నిలిచిన బసవన్నను ఈ రోజున రైతులు పూజిస్తారు. ఆ రోజు తెల్లవారగానే పశువులను శుభ్రంగా కడిగి, కొమ్ములకు – ముఖానికి పసుపు రాసి, కుంకుమబొట్లు పెట్టి పూలమాలలు వేస్తారు. అలంకరణకు కుచ్చులు కడతారు. కొమ్ములకు వెండి కొప్పులు ధరింపచేసి ఆకులో అన్నం పెట్టి తినిపిస్తారు. కొన్ని ప్రాంతాలలో గోపూజతో పాటు పక్షి పూజ కూడా చేస్తారు. 
 
రైతులు సంక్రాంతికి ముందుసాగే కుప్పనూర్పిళ్ళ సందర్భంలో వరివెన్నులను గుత్తులుగా చేర్చి, పిచ్చుకలు తినేందుకై ఇళ్ళలోను, దేవాలయ ప్రాంగణాలలోను కుచ్చులుగా కడతారు. దేవునికి వడ్ల కుచ్చు ఇస్తామని మొక్కుకుని, ఆ మొక్కును కనుమ రోజున తీర్చుకోవడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాలలో స్త్రీలు చక్కగా అలంకరించుకొని తాము పక్షులకు పెట్టదలచుకున్న గింజలతో చెరువు గట్టుకో, బహిరంగ ప్రదేశానికో వెళ్ళి అక్కడ పక్షులకు మేత వేసి వస్తారు. 
 
పక్షులు ఎంత ఎక్కువగా వచ్చి, ఆ ముద్దలను ఆరగిస్తే అంత మంచి జరుగుతుందని నమ్మకం. మినుములతో చేసిన వంటకాలను ఈ రోజున తప్పక భుజించాలి. దీని వల్ల రాహు గ్రహ దోషనివారణ జరుగుతుంది.  అందరూ కనుమ రోజు మాంసం తినాలని అనుకుంటారు. అది తప్పుడు అభిప్రాయం. కనుమ పశువుల ప్రాముఖ్యతను తెలిపే పండుగ. నేడు పశువులను పూజించాలే తప్ప, భుజించకూడదు. నేడు కనీసం గుడ్డు కూడా తినరాదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చిట్టిరెడ్డీ... మీరు అద్భుతాలు చూస్తారు త్వరలో: కిరణ్ రాయల్

బీటెక్ బంగారు బాతుగుడ్డు కాదు, 6 నెలలకే ఔట్: 700 మందిని ఇన్ఫోసిస్ ఊస్టింగ్

తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ.. ప్రజలు చికెన్ తినొద్దు..

ఫిబ్రవరి 28న పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఏపీ సర్కార్

అక్కా అంటూ ఇంట్లోకి వచ్చాడు.. కూతురుపై కన్నేసి కాటేశాడు...

అన్నీ చూడండి

లేటెస్ట్

09-02-2025 నుంచి 15-02-2025 వరకు ఫలితాలు.. అపజయాలకు కుంగిపోవద్దు..

08-02-2025 శనివారం దినఫలితాలు- పొగిడే వ్యక్తులను నమ్మవద్దు...

శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి గురించి తెలుసా? శేషాచలంలో 3.5 కోట్ల పవిత్ర తీర్థాలు

07-02- 2025 శుక్రవారం రాశి ఫలాలు : ఎవరినీ అతిగా నమ్మవద్దు...

రికార్డ్ స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. వరుసగా 35 మాసాలు వంద కోట్ల మార్క్

తర్వాతి కథనం
Show comments