Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల- రూ.10వేలు ఇస్తే.. ఇక శ్రీవారి బ్రేక్ దర్శనం

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (12:46 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో దళారులకు అడ్డుకట్ట వేసే దిశగా కొత్త దర్శనానికి నాంది పలికారు.. టీటీడీ అధికారులు. ఇప్పటికే ఎల్-1, ఎల్-2, ఎల్-3 దర్శనాలను రద్దు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇకపై దాతల నుంచి విరాళాలు తీసుకుని, వారికి ముఖ్యమైన సేవా టికెట్లను అందించాలని నిర్ణయించింది. 
 
ఇందులో భాగంగా, శ్రీవాణి ట్రస్ట్‌ను ప్రారంభించిన టీటీడీ, రూ.10 వేల విరాళం ఇచ్చే భక్తులకు స్వామి సమక్షంలో తీర్థం, శఠారిలతో కూడిన బ్రేక్ దర్శన సౌకర్యాన్ని కల్పించనుంది. అంతకుమించి విరాళాలు ఇస్తే, ముఖ్యమైన వస్త్రాలంకార, తోమాల, అర్చన వంటి సేవా టికెట్లను ఇవ్వాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించాకు. 
 
ఇందులో భాగంగా తొలి దశలో రోజుకు 200 టికెట్లను విడుదల చేస్తూ, ప్రయోగాత్మకంగా పరిశీలించాలని, ఆపై భక్తుల ఆదరణను బట్టి, రోజుకు 1000 టికెట్ల వరకూ కేటాయించాలని భావిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. దీంతో రోజుకు కనీసం కోటి రూపాయల చొప్పున ఏడాదిలో రూ. 360 కోట్లకు పైగా ఆదాయాన్ని పొందవచ్చని అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ మంత్రి హసన్ లంజార్ ఇంటికి నిప్పు, దరిద్రుడు మా నీళ్లు మళ్లిస్తున్నాడంటూ సింధ్ ప్రజలు ఫైర్

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

Snakes: ఆ చెట్టు నిండా పాములే.. కొమ్మకు కొమ్మకు కొండ చిలువలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

అన్నీ చూడండి

లేటెస్ట్

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

తర్వాతి కథనం
Show comments