Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్‌లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు: టీటీడీ గుడ్‌న్యూస్

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (20:24 IST)
ఆఫ్‌లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లను ఈ నెల 16 నుంచి జారీ చేస్తున్నట్లు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. తద్వారా సామాన్య భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. రోజుకు పదివేల టిక్కెట్ల చొప్పున తిరుపతిలో ఆఫ్‌‍లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేసిందుకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. 
 
ఉదయాస్తమాన సేవకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ సిద్ధం చేశామని, ఈ నెల 16వ తేదీన ఉదయం 9:30 నిమిషాల నుంచి టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేస్తామని వెల్లడించారు. 
 
చిన్న పిల్లల ఆసుపత్రికి విరాళాలు ఇచ్చే దాతలకు ఉదయాస్తమాన సేవ దర్శనం కల్పిస్తామని గతంలో తెలియజేశామని గుర్తుచేశారు. దాతలు ముందుకు వచ్చి ఉదయాస్తమాన సేవను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఆర్జిత సేవల పునరుద్ధరణపై మార్చి నెలలో జరగబోయే టీటీడీ బోర్డు మీటింగ్‌లో చర్చిస్తామని టీటీడీ ఈవో తెలిపారు.
 
ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లతో పాటు.. ఉదయాస్తమాన సేవ టికెట్ల బుకింగ్‌ డోనేషన్‌ విండోను ఈ నెల 16న అందుబాటులోకి రానుంది టీటీడీ. టికెట్ల బుకింగ్‌ కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. 

సంబంధిత వార్తలు

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments