Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి దర్శనం: 2నెలల టోకెన్లు 22వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (21:19 IST)
తిరుమల శ్రీవారి దర్శనానికి గాను నవంబరు, డిసెంబరు నెలలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఎస్ఈడి) టోకెన్లను అక్టోబరు 22వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. 
 
నవంబరు నెలకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు అక్టోబరు 23వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అలాగే.. తిరుమలలో వసతికి సంబంధించి నవంబరు నెల కోటాను అక్టోబరు 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయడం జరుగుతుందని టీటీడీ తెలిపింది.
 
ఇదిలావుంటే.. డిసెంబరు 8 వ తేదీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం, డిసెంబరు 16వ తేదీ ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ఈ రెండు రోజులకు సంబంధించి శ్రీవారి ఆలయ కార్యక్రమాలు ఇంకా ఖరారు కాలేదు. 
 
ఈ కార్యక్రమాల వివరాలు ఖరారయ్యాక డిసెంబరు 8, 16 వ తేదీలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. భక్తులు ఈ విషయం గుర్తించి స్వామి వారి దర్శనం టోకెన్లు, తిరుమలలో వసతి బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది.

సంబంధిత వార్తలు

నదిలో దూకిన ప్రేమజంట.. కాపాడి చెంప పగలగొట్టి ప్రియుడి చెంప పగలగొట్టిన జాలరి!!

క్లాప్ పేరుతో చెత్త పన్ను వసూలు చేసిన వైకాపా ప్రభుత్వం.. రద్దు చేసిన టీడీపీ సర్కారు!

బ్యాటరీ మింగేసిన 11 నెలల చిన్నారి - సురక్షితంగా తొలగించిన వైద్యులు

నెరవేరిన శపథం... సీఎంగా చంద్రబాబు - ఐదేళ్ళ తర్వాత పుట్టింటికి మహిళ!

పిన్నెల్లి సోదరులపై మాచర్ల పోలీసుల రౌడీషీట్!!

దేవతా వృక్షం రావిచెట్టుకు ప్రదక్షిణ చేసేవారికి ఇది తెలుసా?

12-06-202 బుధవారం దినఫలాలు - దంపతుల మధ్య చికాకులు తలెత్తినా..?

11-06-2024 - మంగళవారం- పంచమి రోజున వారాహిని పూజిస్తే శుభం

12-06-202 బుధవారం దినఫలాలు - దంపతుల మధ్య చికాకులు తలెత్తినా..?

10-06-2024 సోమవారం దినఫలాలు - పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం...

తర్వాతి కథనం
Show comments