Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త.. త్వరలో యాప్ ద్వారా శ్రీవారి దర్శన టిక్కెట్లు

తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తుల కోసం కొన్ని ప్రత్యేక యాప్‌లను రూపొందించనుంది. కేవలం ఇప్పటివరకు విఐపిలకు మాత్రమే అందుబాటులో ఉండే స్వామివారి సేవా టిక్కెట్లను సామాన్యులకే అందేలా చర్యలు తీసుకుంటోం

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (10:27 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తుల కోసం కొన్ని ప్రత్యేక యాప్‌లను రూపొందించనుంది. కేవలం ఇప్పటివరకు విఐపిలకు మాత్రమే అందుబాటులో ఉండే స్వామివారి సేవా టిక్కెట్లను సామాన్యులకే అందేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా సేవా టిక్కెట్లను అందిస్తున్న తితిదే మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. అదే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునేలా ప్రత్యేకమైన యాప్.
 
నిజంగా ఇది శ్రీవారి భక్తులకు శుభవార్తే. త్వరలో యాప్ ద్వారా శ్రీవారి దర్శన టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తితిదే ఈఓ సాంబశివరావు తెలిపారు. శ్రీవారి యాప్ పేరుతో గదులు, టిక్కెట్లు బుక్ చేసుకోవడం మరింత సులభతరం అవుతుంది. 
 
ఇప్పటికే ఈ యాప్‌ను తితిదే సిద్ధం చేసిందట. త్వరలో భక్తులకు అందుబాటులోకి వస్తే ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ.. తితిదే వసతి సముదాయాల చుట్టూ భక్తులు తిరగాల్సిన అవసరం లేదు. నేరుగా యాప్ ద్వారా ఏది కావాలంటే అది దొరికే వీలుంది. అలాగే ఆన్‌లైన్‌‍లో 30 0రూపాయల టిక్కెట్ల సంఖ్యను ఆరు నుంచి పదికి పెంచుతూ తితిదే నిర్ణయం తీసుకుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Khairatabad: ఖైరతాబాద్ వినాయకుడి సన్నిధిలోనే ప్రసవించిన మహిళ

వినాయక చవితి ఉత్సవాలకు అంతరాయం కలిగిస్తున్న వరుణుడు

Ganesha Festival: చామంతి పువ్వులకు భారీ డిమాండ్.. కిలో రూ.500

జమ్మూకాశ్మీర్‌‌లో భారీ వర్షాలు.. ఇంటర్నెట్ బంద్- వైష్ణోదేవి యాత్రకు అంతరాయం

అమెరికన్ సంస్థ జీఈతో భారత్ డీల్.. 1 బిలియన్ డాలర్ల ఒప్పందం సంతకానికి రెడీ

అన్నీ చూడండి

లేటెస్ట్

Ganesh Chaturthi 2025: వక్రతుండ మహాకాయ

గణేశుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి?

24-08-2025 నుంచి 30-08-2025 వరకు మీ వార ఫలితాల - వృత్తి ఉద్యోగాల్లో రాణింపు...

24-08-2025 ఆదివారం మీ రోజువారీ ఫలితాలు

Padmanabhaswamy: శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో కంప్యూటర్ సిస్టమ్, సర్వర్ డేటాబేస్ హ్యాక్

తర్వాతి కథనం
Show comments