శ్రీవారి భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త.. ఏంటది..?

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (10:52 IST)
శ్రీవారి భక్తులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఓ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుమల తిరుపతికి రిజర్వేషన్ చేయించుకునే సమయంలోనే తిరుమల శ్రీవారి దర్శనం కోసం కూడా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ టిక్కెట్ ధర రూ.300. ఈ టిక్కెట్‌తో శీఘ్రదర్శనం చేసుకోవచ్చు. 
 
తిరుపతికి వెళ్లే దూరప్రాంత సర్వీసులకు ఈ సదుపాయం వర్తిస్తుందని, ప్రయాణ చార్జీతో పాటు రూ.300 అదనంగా చెల్లించి ఉదయం 11 గంటల స్లాట్‌లో, ఆపై సాయంత్రం 4 గంటల స్లాట్‌లో టికెట్లను ఎంచుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ స్కీమ్ కింద రోజుకు 1000 టిక్కెట్లను జారీచేస్తారు. 
 
ఈ టికెట్లు పొందిన వారికి త్వరితగతిన దర్శనం కల్పించేలా చూడడానికి తిరుమల బస్ స్టేషన్‌లో ఆర్టీసీ సూపర్ వైజర్లను కూడా నియమించింది. కాగా, బెంగళూరు, హైదరాబాద్, పాండిచ్చేరి, విశాఖపట్నం, చెన్నై, కంచి, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. పైగా, వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఆర్టీసీ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అసలు ధరలకే మద్యం అమ్మాలి.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేయొద్దు.. పవన్ కల్యాణ్

Pawan Kalyan: వరంగల్‌లోని భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన అన్నా లెజ్‌నోవా

చంద్రబాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని పూజలు చేసేందుకు వెళితే కేసులు పెట్టారు : విడదల రజనీ

మైనర్‌పై అత్యాచారం.. ఆపై బ్లాక్ మెయిల్.. నిందితుడుకి దేహశుద్ధి చేసిన లాయర్లు

Bolisetti Satyanarayana, జనసేనకు గుడ్ బై, Just a small break

అన్నీ చూడండి

లేటెస్ట్

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

31-01-2026 శనివారం ఫలితాలు : పెట్టుబడులకు మంచి తరుణం కాదు...

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

తర్వాతి కథనం
Show comments