శ్రీవారి దర్శనం కోసం భక్తుల సంఖ్యను పెంచనున్న తితిదే

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (15:28 IST)
కలియుగ వైకుంఠదైవంగా భావించే శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం కరోనా లాక్డౌన్ వేళ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు తీసుకుంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ శ్రీవారి దర్శనానికి అనుమతి ఇచ్చిన తితిదే... ప్రస్తుతం ప్రతి రోజూ 10 వేల మందిని ఆలయంలోకి అనుమతిస్తోంది. శుక్రవారం నుంచి మరో 3 వేల మంది భక్తులను అదనంగా అనుమతించాలని తితిదే అధికారులు నిర్ణయించారు. 
 
ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఈ నెల 30వ తేదీ వరకూ ప్రతి నిత్యం మరో 3 వేల టిక్కెట్లను టీటీడీ విడుదల చేసింది. జులై మొదటి వారం నుంచి దర్శనం సంఖ్యను మరింత పెంచనుంది. దర్శన సమయంలో కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 9గంటలకు ఆలయాన్ని మూసివేస్తుండగా... జులై మాసంలో రాత్రి 11 గంటలకు మూసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పారిశుద్ధ్య మహిళా కార్మికురాలి నిజాయికితీ బంగారు బహుమతి

అమెరికా ఒత్తిడికి లొంగిపోయిన ప్రధాని మోడీ : రాహుల్ ధ్వజం

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం : సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిటీ

YouTuber అరుణ్‌ పన్వర్‌కి కట్నంగా రూ. 71 లక్షలు, 21 తులాల బంగారం?

మా దేశ గోప్యతతో ఆడుకోలేరు .. మెటాకు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్

అన్నీ చూడండి

లేటెస్ట్

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

31-01-2026 శనివారం ఫలితాలు : పెట్టుబడులకు మంచి తరుణం కాదు...

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

తర్వాతి కథనం
Show comments